తెలుగు తూలిక లో నాకథ

తెలుగు తూలిక లో తొలిసారి అడుగు పెట్టాను ఒక చిన్ని కథతో చదివి మీ అభిప్రాయాలు చెప్పండి ....ఇదిగో లింకు http://tethulika.wordpress.com/http://tethulika.wordpress.com/


కథాజగత్ లో నా కథ

కథా జగత్ లో నాకథ ప్రచురించబడింది. చదివి మీ అభిప్రాయం తెలియజేయగలరు..

మానవత్వం..

ఎర్ర చీమ అలుక !!!!!

ఎర్ర చీమకు కోపమొచ్చింది!

కుట్టి చంపుతా అని కేక పెట్టింది!
"వద్దే చిన్నారి మనవరాలా......"
వయసులో పెద్ద చీమ గట్టిగా అరిచింది!
" ఎందుకె నేను తీపి తింటుంటే ఇంతగా విదలకొడ తారీ మనుష్యులు??? "

" తీపే కాదే, ఏ ఆహారమైనా వాళ్ళు ఇంతే!!
చీమల మందుతో ఉక్కిరి బిక్కిరి చేస్తారు !!
నీళ్ళ ధిక్భ్ భంధన తో ప్రాణాలు తీస్తారు!
లేదా, విదిలించి చేతితో నలిపెస్తారు !"

"అందుకేనే అడుగుతున్నా
తిండి కోసం ఆశపడ్డం తప్పా?
వాళ్ళు కూడా తింటారుగా, మేము తింటే ఏం ?
మనను చూసి ఎంత నేర్చుకుంటారు,
సంఘజీవులు చీమలన్నారు !!
మన కాలనీ లను బోలిన కాలనీలు కట్టుకున్నారు !
కష్టజీవులు చీమలంటారు!
ముందు చూపు వుండాలి చీమల్లగా అంటారు!
మన రాజు- రాణి లాగ దేశాలు యేలారు!!"
మనమింత చిన్న ప్రాణులం ,
లైనుగావేడుతున్నా నెత్తిన పొడి చల్లి చంపుతారు!!
నేను కుట్టి చంపుతా!!!"
అంది కోపమోచ్చిన ఎర్రచీమ !!
పాపం దాని కేం తెలుసు మనుషులు మనుష్యులనే చంప వేనుదీయరని!!!

సందర్సకుల మీటర్!!

అబ్బ ఇన్ని రోజులకు సందర్సకుల మీటర్ పెట్టుకున్నా నొచ్ !!!!!!!!!!!!

స్వే చ్చ కొసం

..

తురుపుముక్క లో మురళి గారి కాన్సెప్ట్ అర్టం అయ్యాక కథను ఇంకోవిధంగా ఆలోచిస్తే ఎలా వుంటుంది అన్నది రాయటం ఒక అవకాసం గా భావించి రాయడానికి వుచ్చాహ పడ్డాను. ఇంకో కారణం కూడా వుంది. కొన్నేళ్ళ క్రితం “ప్రేమ” అన్న నవలను యుద్దనపూడి, యండమూరి, మరొక రచయిత్రి రాసారు..అందులో సులోచనారాణి ప్రేమ నిండి వున్న నవలను, యండమూరి ప్రపంచస్థాయి లో ఒక ప్రాబ్లం ను , మరో రచయిత్రి మరో కోణం లో అలోచించి రాసింది నన్నెంతో ఆకట్టుకుంది...ఇప్పుడు ఒక కథ చెప్పి దాన్ని తిరగ రాస్తే....అనగానే ...అబ్బ..... నాకు ఒక ఛాన్స్ అనుకుంటూ రాసాను...ఇది అందరికి నచ్చితే నేను గెలిచినట్టే.....చదివి మీ అభిప్రాయం తెలుపుతారు కదూ....

http://turupumukka.blogspot.com/2011/02/blog-post_26.html ఒక్కసారి చూడండి !

స్వే చ్చ కొసం ....... రచన-లక్ష్మీ రాఘవ -------------------------------------------------------
అలా హటాత్తుగా మాయమైపొతే ఏమనుకుంటారు? అందరు రాచి రంపాన పెట్టింది అనుకోరూ . అలా అనుకోవాలనేకదా మీ నిర్వాకం ?” రెట్టించిన గొంతుకతో హుంకరిస్తూ వుంది వర్ధని .
భర్త రాజారావు ఆమెవంక చూడలేదు . తనను కానట్టే అటు తిరిగి పడుకున్నాడు .
“ఈ ముంగి మనిషితో ఇన్నేళ్ళు కాపురం ఎలాచేసానురా దేవుడా ..దేనికి వులకడు పలకడు !!”మళ్ళి మొదలు పెట్టింది వర్దని. వద్దనుకున్నా వినిపిస్తున్న ఆ మాటలకు నవ్వు వచ్చింది రాజారావుకి . గయ్యాళి భార్యతో తను ఎలా కాపురం చేసాడు ? దేనికైనా మాట్లాడాడా?? అమ్మ చాటున ఎలా పెరిగాడు తను? చిన్నప్పుడే తండ్రి చనిపోతే అమ్మ ఎంత కష్టపడి చదివించింది తనను ? అమ్మ కొసం, అమ్మను నొప్పించకుండా ఎలా నడచు కున్నాడు తను? చివరికి అమ్మ జబ్బు పడిపోయినప్పుడు వర్ధని సంబంధం వస్తే “వద్దమ్మ మనకు డబ్బున్న వాళ్ళ సంబంధం “ అని చెబితే “ రాజా అసలే నోట్లో నాలుక లేనివాడివి , నేను పొతే ఎలా బతుకుతావో అని దిగులు పడుతుంటే ఈ సంబంధం వచ్చిందిరా ....కలిగిన కుటుంబం ..ఐతే.. పిల్ల కాస్తా లావుగా వుంటుందిట..అందుకే మన వరకు వచ్చినారు. పైగా ఇల్లటం కావాలని వాళ్ళ కోరిక ..నీకు నేను పొతే నీకు ఎవరూ లేరురా.. ఇల్లటం పోయినా నీకూ అంటూ ఒక కలిగిన కుటుంబం వుంటుంది ..నా మాట కాదనకు” అని చెప్పి ,చేతులో చెయ్యేసి వొప్పించి పెళ్లి చేసిన నెలలోనే చనిపోయింది అమ్మ . అమ్మ పోయిన లోటు కన్నా వర్ధని చేసే పెత్తనం భరించడం కష్టం అయ్యింది రాజారావుకు .అయినా అమ్మ మాటకోసం చేసుకున్నాను ..అంతే ....అని జీవించసాగాడు .
ఇంట్లో ఏమాత్రం మాట జరగదు..దేనికైనా ఇలా చేస్తే బాగుంటుంది అనగానే “నీకు తెలియదు వూరుకో “ అనేది వర్ధని .
భర్తని నువ్వు అని సంభోదిస్తే ఇబ్బంది అయ్యేది కొత్తల్లో ..తరువాత అలవాటైంది .
.కొడుకు పుట్టాడు కాని వాడిని తండ్రి దగ్గర చేరనియ్యకుండా అంతా తానే అయ్యింది వర్ధని ..అందుకే వాడికి కూడా అలుసయ్యింది తండ్రి అంటే.....
ఈరోజు జరిగిన సంఘటన రాజారావు ని క్రుంగ దీసింది ..
.అసలేమయ్యిందంటే......
కొడుకు పెళ్లి చూపులకి వెళ్ళాలి .. “నీవు ఇంటి దగ్గరే వుండు ..నేను వాడు వెడతాం “ అంది.
మొదటిసారిగా “ నేను వస్తా “ అన్నాడు
“ నిన్ను చూస్తే వాళ్ళు పిల్లని ఇవ్వరు కూడా “
“ఎందుకు ?” అలా అడిగాడు అంటేనే ఆశ్చర్యంగా వుంది !!
“ నీవొక మనిషిలా మాట్లడగాలవా ? దేనికి నోరు తెరవలేనివాడివి ..అక్కడ మాట్లాడి సంబంధం చెడ గోడ తావు . అంతే!”
అంటే ఇలా పెంచిన కుక్క లాగా పడి వుండాల్సిందే నా ? దానికైనా మొరగడానికి స్వాతంత్రం వుంటుంది ....బాగా కోపం వచ్చింది రాజారావుకు ..వర్ధనిని ఎడా పెడా తిట్టేయ్యాల అనిపించిన్ది కాని అదిచేయ్యలేక తన నిస్సహాయ స్తితి కి ఏడు పు వచ్చింది .. అందుకే చెప్ప చెయ్యకుండా బయటకు వెళ్ళి పోయాడు ..నడుస్తుంటే కొంచం ఆవేశం తగ్గింది .కానీ వూ రికి దూరంగా వచ్చేసినట్టు అనిపించింది. అక్కడక్కడా గుడిసెలు వున్నాయి. గుడిసేలముండు స్వేచ్చగా ఆడుకుంటున్న పిల్లలు!! వాళ్ళకున్న స్వేచ్చ తనకు లేకపోయింది !!అనుకుంటూ అక్కడే వున్నా ఒక బండమీద కూర్చున్నాడు ...
గుడిసెల దగ్గరనుండి ఒక అత ను వచ్చి” ఏమీ అయ్యా వాకింగు వచ్చారా “ అని అడిగాడు.
అవునన్నాడు... ఇంకేమి చెప్పలేక... “అయ్యా చదువుకున్నోరిలగావున్నారు ...మా పిల్లకాయలకి సదువుకోవడానికి ఇస్కూలు పెట్టిన్చినారు గాని బడి పంతులు ఎవరూ రాలేదు ఇప్పటికి సంవచ్చరమాయే ...ఎవ్వరికి సేప్పుకోవాలో తెలియదు ..కొంచం సాయం సేయ్యండి “ అన్నాడు .
.రాజారావు సరే అన్నాడు .. రేపు మళ్ళి వస్తాలే “అని చెప్పాడు అనుకోకుండా ..
తిరిగి ఇంటికి నడచుకు వచ్చేసరికి నాలుగు గంటలు ఇంటికి దూరంగా వుండి పోయినట్టు వర్ధని మాటలవల్ల తెలిసింది వెనక్కి వచ్చిన రాజారావును గట్టిగా అరుస్తూ మరీ తిట్టింది వర్ధని !!
“అలా వెళ్ళిపోతే పెద్ద గుర్తింపు వస్తుందని కున్నవా..నీ గుర్తింపు అంతా వర్ధని మొగుడుగానే ..అదే నీ బతుకు !!” ఒక్కసారి గుచ్చు కుందా మాట ...
నిజమే ఇన్ని రోజులు భార్యను వదలి బయటకు వెడితే సమాజం లో బాగుండ దనే సహించాడు ..అందుకు మిగిలిందేమిటి ?
భార్య ప్రేమ చూపదు.....కొడుకును దగ్గరికి చేరనివ్వదు ..అందరు వుంటారని అమ్మ అనుకుంది కాని తానూ ఎప్పటికి ఒంటరిగానే మిగిలి పోయ్యాడని తేలిపోయింది ..
అతను మొదటిసారిగా ఏమీ చెయ్యాలని ఆలోచించడం ప్రారంభించాడు ...
నాలుగు రోజులు గడిచాయి ..పెళ్లి చూపులు అయ్యాయి ..సంబంధం ఖాయం చేసింది వర్ధిని . కానీ ఖాయం అయ్యిందని కూడా చెప్పలేదు భర్తకు .... Engagement అని రెండు మూడుసార్లు ఇంట్లో వినపడింది .ఎప్పుడూ అని అడగాలని అనిపించలేదు !!
ఈలోగా రెండు సార్లు గుడిసేలదాకా వెళ్ళి వచ్చాడు ..వాళ్ళు ఎంతో ఆప్యాయతతో మాట్లాడుతుంటే ఎంతో సంతోష పడ్డాడు ..వారితో మాట్లాడుతూ సలహాలు ఇస్తుంటే తనను వర్ధని ఎంతగా అణచి పెట్టిందో అర్టం అయ్యింది .
. “ రేపు పొద్దున్న Engagement 10 గంటలకి తయ్యారుగా వుండు “ రాత్రి పడుకునే ముందు చెప్పింది వర్ధని .
“నేనెందుకు?” మెల్లిగా అన్నాడు
“నాకూ మొగుడు ఒకడు వున్నాడని తెలియ చేయడానికేలే “ నిర్ల క్ష్యంగా అంది వర్ధని తరువాత మాట్లాడలేదు రాజా రావు .
.రాత్రి బాగా ఆలోచించాడు .. తెల్లారగానే తొందరగాలేచాడు ..స్నానం చేసి రెడీ అయ్యాడు .తను దాచు కున్న డబ్బు జేబులో పెట్టు కున్నాడు . వర్ధని బాగా నిద్ర పోవడం మరోసారి చూసి నెమ్మదిగా కదిలాడు బయటకు .. తన అవుసరం ఇక్కడి కంటే గుడిసెల వారి దగ్గరే చాలా వుంది అనుకుంటూ ముందుకు సాగాడు , engagement లో తను లేకపోయినా manege చెయ్యగల వర్ధిని జీవితం నుండి శాశ్వతంగా తప్పుకుంటూ...........

గోరు చావు.....

గోరు చావు

గోరుకు బలంగా తగిలింది !

అమ్మా!!! అంటూ బాధతో నోరు తెరిచింది,

గోరుకింద నాళాలు నోరు తెరిచాయి !!

నరాలు బాధను మెదడుకు తెలిపాయి!

విపరీతమయిన నొప్పికి చేయ్యంతా జివ్వుమంది!!

దెబ్బతిన్న భాగాన కణాలు కూడ బలుక్కున్నాయి ,

రిపేరు చేద్దామంటూ నడుం కట్టాయి !!

గోరుకి వేలుకి మద్య రక్త స్రావమై నల్లబడింది !!

అయినా గోరుని వేలుని బంధించి వుంచింది !!!

కాని దెబ్బతిన్న గోరు మెల్లి మెల్లిగా వేరుపడినది!!

నానుంచి దూరమైనావు , ఇక నీకు మృత్యువే ‘’ అంది వేలు !!

క్రమంగా గోరు వదులు వూ డ సాగింది !!

ఒక రోజు చచ్చిన గోరు వేలును వీడింది !!

వేలు స్వేచ్చగా మరోగోరుకు పునాది వేసింది!!!

జీవితమూ అంతే!!

బంధం వున్నన్ని నా ళ్ళే అంటిపెట్టుకు వుండటం,

బంధం వీడగానే , ఆత్మ ఎగిరిపోగానే ,

శరీరానికి మృత్యువే!!

మరోచోట జననము ఖాయమే!!

చావు......జననము...నిరంతర ప్రయాణమే!!


---------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఈమధ్య దెబ్బతగిలి నా గోరు వూడి కొత్తగోరు వచ్చిన సందర్భంగా !!!!!

కదంబమాలిక-8

కదంబమాలిక-8

చిన్నప్పుడు పెద్దమ్మ దగ్గరికి మద్రాసు వెడితే మార్కెట్టు లో సైకిలు మీద బుట్టలు పెట్టుకుని అత్యంత సువాసన వచ్చే కదంబం మాలలు అమ్మేవారు. “కదంబం” అన్న పదానికి అర్థం –వివిదరకాలపూలను కలిపి కట్టడం అని పెద్దమ్మ చెప్పింది . అలా అప్పుడు నా చిన్ని బుర్రలో entry తీసుకుంది కదంబమాల !!!

ఇటివల ఒక్కసారిగా ప్రమదావనంలో సువాసనలు గుప్పున వస్తూటే వాటిని ఘాడంగా పిల్చేసి మనసు డోలలాడుతూ పరవశం లో వున్నా నన్ను కదంబమాల లో మీ పూల పరిమళం చేరుస్తా రా ? అని అడిగితె వుక్కిరిబిక్కిరి అయ్యాను ..ఎందుకంటే ...రచయిత్రులు కామంటూనే అందంగా అల్లెస్తున్న ప్రమదావన కుసుమాల మద్య అందంగా ఇమడ గలనా అని సందేహం !! కదంబమాల లో నాపువ్వు ని ఆగ్రాణి౦చి చెబుతారు కదా...

ముందు వారం ఏమిజరిగిందో గుర్తుకుతెచ్చుకుందాం ...3psmlakshmi.blogspot.com లో కదంబమాల -7 లో

---- ----- ------- ------ ------ ------- ------- ------ ---------

జానకిని చూడటానికి శ్రీరాం ,సరోజినీ , అనిత , సుభద్ర వెళ్లారు . సుభద్ర ని వద్దన్నారు కాని “నేను జానకిని చూడాలి “ అని వచ్చింది .

జానకికి ఎక్కువ దెబ్బలు తగల్లేదు. కాని మానసికంగా బలహీనంగా వుంది వీళ్ళందరినీ చూడగానే బోరున ఏద్చేసింది .సుభద్ర వెళ్ళి జానకి చెయ్యి పట్టుకుంది . అనిత సరోజినీ మంచం మీద కూర్చుని” రేపే వెళ్ళిపోదాం జానకీ.పరవాలేదు “అని అనునయించారు . శ్రీరామ్ డాక్టర్ గారితో మాట్లాడి వచ్చాడు . బిల్ పేమెంట్ పూర్తిగా తన బాధ్యత అని చెప్పి వచ్చాడు. లక్షుమ్మ ,ఆమె భర్తను ధ్యేర్యంగా వుండమని , కొద్ది రోజులు జానకిని అంటిపెట్టుకుని వుండాలని చెప్పారు. మరుసటి రోజు తను వచ్చి డాక్టర్ గారితో మాట్లాడి వెడ తానని చెప్పాడు ....

ఇంటికి వచ్చాక అనిత ఎక్కువ మాట్లాడలేదు. లక్షుమ్మ అన్న మాటలు ఆమె చెవిలో ఇంకా వినపడుతూనే వున్నాయి.”కాలేజిలో ఇతర పిల్లలకు,టీచర్లకు చెబితే అనితమ్మ మీద అల్లరి మానేస్తారుకద “ అంది ఏంతో ఆవేదనతో

“చదువుకునే పిల్లల మీద అలాటి భాద్యతలు పెట్టకూడదని అలా చేస్తే అనిత విషయం నలుగురి నోళ్ళలో పడుతుదని “అన్నశ్రీరామ్ మాటలు గుర్తుకు వచ్చాయి .

మధ్యతరగతి కుటు౦బాలలో ఎప్పుడూ ఇలాటి మాటలే వినిపిస్తాయి .దిగువతరగతి వాళ్ళు తిరగబడతారు .పై తరగతి వాళ్ళు ఎటువంటి పరిస్తితిని డబ్బు సహాయం తో సరి చేసుకుంటారు ..మధ్య తరగతివాళ్ళు తలవంచుకు పోవాల్సిన్దేనా?? అనిత ఆలోచనలు సాగిపోతూనే వున్నాయి.

మరురోజు లాలేజిలో ప్రేరణ ని కలిసింది “తన మనసులోని మాటలన్నీ ప్రేరణ ముందు వుంచింది. అనిత లో వచ్చిన మార్పుకు ప్రేరణ ఆశ్చర్యపోయింది. ఆరోజే కాలేజి లో వున్నా కరాటే క్లాసులకు చేరడానికి ఏమి చెయ్యాలో కనుక్కుని ఇంటికి వెళ్ళింది.

“నేను కరాటే క్లాసులకు చేరతాను పెదనాన్నా “ అని శ్రీరామ్ తో చెప్పింది.

“మొదట చదువు సంగతి చూడా లమ్మ. బాగా చదువుకోవాలి ఆపైనే”

“చదువులో ఏమాత్రం తగ్గను పెద్దనాన్న . నా ఆత్మరక్షణ కొసం కరాటే నేర్చుకుంటే బాగుంటుందనుకుంటున్నాను ..ప్రతిసారి నాకు తోడుగా ఎవరైనా వస్తారా అని ఎదురుచూడటం కన్నా ఇలాటివి నేర్చుకుని దైర్యం గా వుండటం మేలుకదా “

శ్రీరాం మౌనం అంగీకారం అయింది.

ఆరోజు కరాటే క్లాసు తరువాత తన ఫ్రెండ్ శశి తో పాటు ఇంటికి వస్తోంది అనిత. సర్రున ఆగింది టూ వీలర్ అనిత పక్కన ..అంతదగ్గరగా ఆగేటప్పటికి అనితకు భయ౦ వేసి కాస్త పక్కకు తప్పుకో బోయింది . ఇంతలో చెయ్యి పట్టుకున్నాడు ఉత్తేజ్ టూ వీలేర్ మీద కూర్చునే ..

“ఏయ్ అనిత , ఏమిటి ఈమధ్య కాలేజి నుండి తిన్నగా రావటం లేదా ? అంట ఆలస్యం అయింది అయింది ఎందుకటా? ఏమికత?”

“ఏయ్ , చెయ్యి వదులు “ గట్టిగా అరిచింది అనిత .

శశి బిత్తర పోయి పక్కకు వొదిగి నిల్చుంది

“ఏమిటే ..అంత గొంతుఎత్తుతున్నావు? పొగరెక్కిందా?”

ఉత్తేజ్ గొంతు పెంచాడు.

ఒక్కసారిగా అనిత స్ప్రింగు లాగాతిరిగి అతను పట్టుకున్న చెయ్యి నేర్పుగా మెలితిప్పి వంచి అతని వీపుమీద ఒక్కతన్ను తన్నింది . అనిత అంత ఫాస్టుగా అలా కొడుతుందని వూహించని ఉత్తేజ్ కిందపడ్డాడు. కాని మెరుపులా లేచాడు వెంటనే వెహికల్ పౌచ్ లో ఉన్న ఆసిడ్ బాటల్ ని మెరుపులా తీసాడు .మూత తీయడానికి ప్రయత్నిస్తుండగా అనిత మల్లి అతని చేతిమీద కొట్టింది కాలుతో. ఆ ఫోర్సుకి బాటల్ మూత ఎగిరిపడి ఆసిడ్ ఉత్తేజ్ ఛాతిమీద పడింది.

“అమ్మ....అమ్మా ....మంట..” ఆసిడ్ పడ్డ ప్రదేశం కాలిపోతుంటే కింద పడి కొట్టుకోసాగాడు .

అనిత వెంటనే శశి చెయ్యి పట్టుకుని లాగి ‘పద” అంది.

ఉత్తేజ్ చుట్టూ జనం మూగారు ..

“నాకు భయంగా వుందే అనితా”

“భయం ఎందుకే? మనం ఏమి తప్పుచేయ్యలేదే...చెడును ఎదిరించాం అంతే ..చెడును ఎదిరిస్తే తప్ప మంచి పెరగదు ..శశి ..ఇందుకే నేను కరాటే నేర్చుకుంది “అనిత వాయిస్ లో ధైర్యానికి శశి ఆశ్చర్య పడింది .ఇన్ని రోజులు చుసిన అనిత వేరు ఇప్పుడు చూస్తున్న అనిత వేరు అనిపించింది శశికి .

ఇల్లు చేరాక శ్రీరామ్ తో “ మీతో మాట్లాడాలి పెదనాన్నా “అంది అనిత అక్కడే వున్నా నారాయణమ్మ, సరోజినీ కొంత ప్రస్నార్తకంగా చూసారు ..

“ఏమిటమ్మ అనితా” అన్నాడు శ్రీరాం .

నెమ్మదిగా జరిగింది అంతా చెప్పింది అనిత.

“ఇప్పుడు చెప్పండి పెదనాన్నా నేను కరాటే నేర్చుకుంది మంచిదయిందా...లేదా “

అప్పుడు తేరుకున్నారు నారాయణమ్మ , సరోజినీ....

“అనితా....” అంటూ ఒక్కసారి అక్కున చేర్చుకుంది నారాయణమ్మ .

“నాలో ఇంత ధైర్యం రావడానికి కారణం నీవుకూడా పెద్దమ్మా..ఏంతో నిష్టతో సంకల్పం చేసి పూజ చేసె నిన్ను చూసి ,నేనుకూడా భగవంతునిమీద నమ్మకంతో ,ధృడమైన సంకల్పం తో ధైర్యం గ ఎదురుతిరగ గ లిగాను ..

అనిత ఆత్మవిశ్వాసానికి అబ్బురపడి సరోజినీ ఆప్యాయంగా అనిత తలనిమిరింది ..

అప్పుడు అన్నాడు శ్రీరాం

"నిన్ను చదువు కోసమని ఇక్కడకు పిలుచుకు వచ్చాను కాని ఇంత తొందరగా నీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ఒక ఆత్మ స్థయిర్యం కల మనిషిగా ఎదుగుతావని వుహించలేక పోయాను ..చుట్టూ ఇలాటివారు తయారైతే ఎంతమందో “జానకి”లను రక్షిపవచ్చు ..తనను తానూ ఎలా రక్షించు కోవడం ఎలానో నేర్పవచ్చు ..అయిన మనం పోలిస్ స్టేషన్ కు వెళ్ళి నీమీద దాడి జరిగినట్టు..ఆత్మ రక్షణ కై నీవు ఎదురు తిరిగినట్టు స్టేట్మెంటు ఇచ్చి వద్దాము పద “

తనను ఇంతగా సప్పోర్టు చేస్తున్న పెదనాన్న ఫామిలీ కి చెయ్యెత్తి దండం పెట్టింది మనసులో.

“అనిత చదువుకుని ఐ.ఏ. స్ అవుతానని అన్నావు .ఇప్పుడేమో రూటు మార్చావు. Future లో ఏమి చేయ్యదలుచుకున్నావు? అడిగింది సరోజినీ

అనిత సమాదానం ఎలావుంటుందో తరువాతి బాగం లో................

కదంబమాల-9 శ్రీలలిత గారి బ్లాగులో చదవండి http://srilalitaa.blogspot.com/2011/01/9.html

.....

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template